Advertisement

  • భారత్‌ తమపై కూడా యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్‌ ఆందోళన

భారత్‌ తమపై కూడా యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్‌ ఆందోళన

By: chandrasekar Fri, 26 June 2020 4:06 PM

భారత్‌ తమపై కూడా యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్‌ ఆందోళన


గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల ఘర్షణ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి యుద్ధానికి దారితీస్తుందని, ఇదే సమయంలో భారత్‌ తమపై కూడా యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్‌ ఆందోళన చెందినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మెహమూద్‌ ఖురేషీ చెప్పారు.

ఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్ కార్యాలయం నుండి 50 శాతం ఉద్యోగులను ఉపసంహరించుకోవాలని భారత్‌ సూచించడంపై ఖురేషి అసంతృప్తి వ్యక్తం చేశారు. మేము కూడా మా దేశంలోని భారత హైకమిషన్ ఉద్యోగులను తమ దేశానికి వెళ్లిపొమ్మంటాం అని అన్నారు.

గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మద్య జరిగిన ఘర్షణను తాము సీరియస్‌గా తీసుకొన్నామని, వారి మధ్య చెలరేగిన ఉద్రిక్తత ఎక్కడ తమపైకి యుద్ధం రూపంలో వస్తుందని భయపడ్డామన్నారు. అయితే, తామేమీ చూస్తూ కూర్చోమని, తగిన విధంగా జవాబిస్తామని చెప్పారు.

మే 31 న ఇద్దరు పాకిస్తాన్ ఎంబసీ అధికారులు గూఢచర్యం చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు కనుగొన్నారు. ఇద్దరు అధికారులు ఒక వ్యక్తిని డబ్బుతో ఆకర్షించి భద్రతా పత్రాలు తీసుకుంటున్నప్పుడు వారిని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు. అనంతరం వీరిని 24 గంటల్లోగా దేశం విడిచిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. జూన్ 15 న ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్‌కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లిన దుండగులు హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఒప్పుకోవాలంటూ గాయపరిచి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసు సమాచారం అందిన వెంటనే భారత్ పాకిస్తాన్ హైకమిషన్ కు సమన్లు ​​పంపింది. అరెస్టు చేసిన అధికారులను ఇబ్బంది పెట్టవద్దని, వారిని ఏ విధంగానూ ప్రశ్నించవద్దని పాకిస్తాన్‌కు తెలిపింది. దాంతో ఆ అధికారులను వెంటనే వారి కార్లతో పాటు భారత రాయబార కార్యాలయం వద్ద దిగబెట్టి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

Tags :
|

Advertisement