Advertisement

  • భారత క్రికెట్ ను ఎంతో తీసుకెళ్లిన ఆటగాడు ధోని..మద్దతుగా నిలిచిన ఆఫ్రిది

భారత క్రికెట్ ను ఎంతో తీసుకెళ్లిన ఆటగాడు ధోని..మద్దతుగా నిలిచిన ఆఫ్రిది

By: Sankar Mon, 12 Oct 2020 4:16 PM

భారత క్రికెట్ ను ఎంతో తీసుకెళ్లిన ఆటగాడు ధోని..మద్దతుగా నిలిచిన ఆఫ్రిది


ఒక ఏడాదికి పైగా క్రికెట్ కు దూరంగా ఉన్న ధోని మళ్ళీ ఐపీఎల్ 2020 తో రీఎంట్రీ ఇచ్చాడు. దాంతో ధోని అభిమానులు, చెన్నై ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడుతున్న ఆటను చూస్తుంటే ఆ సంబరాలు అన్ని వ్యర్ధమే అనిపిస్తుంది.

అయితే ఒక ఆటగాడి జీవితంలో ఒడిదుడుకులు సహజం. కానీ ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై వరుస ఓటములు చవిచూస్తున్న సమయంలో ధోనికి అలాగే అతని కుటుంబ సభ్యులను సోషల్ మీడియా వేదికగా కొంతమంది బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది స్పందించాడు. "ఎంఎస్ ధోని, అతని కుటుంబంపై ఎలాంటి బెదిరింపులు వచ్చాయో నాకు తెలియదు. కానీ అలా చేయడం సరైనది కాదు.

భారత క్రికెట్‌ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన వ్యక్తి ధోని. అది అందరూ గుర్తుంచుకోవాలి. కేవలం కొన్ని మ్యాచ్ లలో విఫలమైనంత మాత్రాన ఇలా చేయడం తప్పు" అని ఆఫ్రీది పేర్కొన్నారు. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ లో ఏడు మ్యాచ్ లు ఆడిన చెన్నై రెండు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది.

Tags :
|
|

Advertisement