Advertisement

  • ధోని రిటైర్మెంట్ పై బీసీసీఐ వ్యవహరించిన తీరు సరిగా లేదన్న పాకిస్థాన్ క్రికెటర్

ధోని రిటైర్మెంట్ పై బీసీసీఐ వ్యవహరించిన తీరు సరిగా లేదన్న పాకిస్థాన్ క్రికెటర్

By: chandrasekar Mon, 24 Aug 2020 10:32 PM

ధోని రిటైర్మెంట్ పై బీసీసీఐ వ్యవహరించిన తీరు సరిగా లేదన్న పాకిస్థాన్ క్రికెటర్


ఇండియా మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పై పాక్ క్రికెటర్ తీవ్రంగా విరుచుకు పడ్డారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యవహరించిన తీరు సరిగా లేదని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 15న ఎవరూ ఊహించనిరీతిలో సడన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌కి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగా అతను కనీసం వీడ్కోలు మ్యాచ్ కూడా ఆడకపోవడంపై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ధోనీ అలా సెండాఫ్ మ్యాచ్ ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం బీసీసీఐ తీరేనని చాలా మంది ఆరోపిస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి ధోనీ దూరమవగా అతడ్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. 2004లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ అలా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ని కోల్పోవడం అదే తొలిసారి. దాంతో భారత సెలక్టర్లు కూడా టీమ్ సెలక్షన్ సమయంలో ధోనీ పేరుని పరిగణలోకి తీసుకోవడం మానేశారు. మొత్తంగా టీమిండియాలోకి ధోనీ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం అసాధ్యమనే వాదనలు వినిపించగా కొంత మంది అతను కెరీర్ 2019 వరల్డ్‌కప్‌తోనే ముగిసిపోయిందని అభిప్రాయపడ్డారు.

కరోనా కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ భారత్ జట్టుకి ధోనీ ఆడతాడని అందరూ ఊహించారు. అంతలోపే అందరికీ షాకిస్తూ ఇంటర్నేషనల్ కెరీర్‌కి అతను గుడ్‌ బై చెప్పేశాడు. ఒకవేళ బీసీసీఐ చొరవ తీసుకుని రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి చర్చలు జరిపివుంటే ధోనీ వీడ్కోలు మ్యాచ్‌ ఆడి గౌరవంగా రిటైర్మెంట్ తీసుకునేవాడని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ధోనీ రిటైర్మెంట్ గురించి సక్లైన్ ముస్తాక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నేను ఎప్పుడూ పాజిటివ్‌గా మాట్లాడేందుకు ప్రయత్నిస్తా. కానీ ఇక్కడ నెగటివ్ గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే? ధోనీ రిటైర్మెంట్ విషయంలో బీసీసీఐ ఫెయిలైంది.

రెండు వరల్డ్ కప్ అందించిన ధోనీ లాంటి దిగ్గజ క్రికెటర్‌ని ట్రీట్ చేసే పద్ధతి ఇది కాదు. అతని రిటైర్మెంట్ మరీ ఇంత పేలవంగా ముగిసిపోయి ఉండకూడదు. నేనే కాదు చాలా మంది అభిమానులు కూడా ఇదే భావనతో ఉన్నారు. ధోనీ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరు సరిగా లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కి గౌరవంగా వీడ్కోలు చెప్పాలనేది ప్రతి క్రికెటర్ కల. నాకు తెలిసి ధోనీకి కూడా ఆ డ్రీమ్ ఉండి ఉంటుంది’ అని ముస్తాక్ వెల్లడించాడు. కరోనా వల్ల దాదాపు అన్ని ఆటలకు ఆటంకం కలిగిన విషయం తెలిసిందే. కనీసం ఆటలు జరిగినట్లైతే ధోని వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం ఉండవచ్చు.

Tags :
|
|

Advertisement