Advertisement

  • ధోని రిటైర్మెంట్ తో తాను కూడా రిటైర్ అయినట్లు ప్రకటించిన ధోని వీరాభిమాని

ధోని రిటైర్మెంట్ తో తాను కూడా రిటైర్ అయినట్లు ప్రకటించిన ధోని వీరాభిమాని

By: Sankar Tue, 18 Aug 2020 12:26 PM

ధోని రిటైర్మెంట్ తో తాను కూడా రిటైర్ అయినట్లు ప్రకటించిన ధోని వీరాభిమాని


క్రికెట్ అంటే పడిచచ్చే అభిమానులు ఇండియా లో కొన్ని కోట్ల మంది ఉన్నారు , క్రికెట్ ఆడే ఆటగాళ్లకు కూడా వీరాభిమానులు వేళా సంఖ్యలో ఉంటారు..ఇక సచిన్ , ధోని , విరాట్ , రోహిత్ వంటి వారికి ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువే అని చెప్పవచు..ముఖ్యంగా సచిన్ , ధోని లకు ఇద్దరు వీరాభిమానులు ఉన్నారు..

వారు ఎప్పుడు అక్కడ మ్యాచ్ జరిగిన మైదానం లో ప్రత్యక్షం అవుతారు...అందులో ఒకరు సచిన్ ఫ్యాన్ సుధీర్ అయితే మరొకరు ధోని ఫ్యాన్ మొహమ్మద్‌ బషీర్‌.ఇతను పాకిస్తాన్ లో పుట్టి అమెరికా లో స్థిరపడ్డాడు .అయితే సచిన్ రిటైర్ అయినా కూడా సుధీర్ మ్యాచ్ లకు వస్తూనే ఉన్నాడు ..కానీ బషీర్ మాత్రం ధోని రిటైర్ అయ్యాడు కాబట్టి తాను కూడా క్రికెట్ చూడటం ఇక నుంచి మానేస్తాను అని ప్రకటించాడు ..

ఎప్పుడూ భారత్‌–పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరిగినా...తన ప్రత్యేక వేషధారణతో మ్యాచ్‌కు హాజరై అతను ధోనికి మద్దతు తెలిపేవాడు. సొంత దేశస్తులు ‘ద్రోహి’ అన్నా బషీర్‌ పట్టించుకోలేదు. ఇప్పుడు ధోని రిటైర్‌ కావడంతో ఇకపై భారత్‌–పాక్‌ మధ్య జరిగే ఎలాంటి మ్యాచ్‌ కూడా చూడనని అతను ప్రకటించాడు. ‘ధోని రిటైర్‌ అయ్యాడంటే నేను కూడా అయినట్లే. ఎక్కడెక్కడికో వెళ్లి అతని లేని మ్యాచ్‌లు చూడటం నాకిష్టం లేదు.

ధోనితో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అతనంటే నాకెంతో ప్రేమ. ధోని కూడా నాపై అదే అభిమానం చూపించాడు. ఏ మైదానంలో కనిపించినా పలకరించడం, తన వైపుఏదో ఒక బహుమతి ఇవ్వడం అతను ఆపలేదు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు కాబట్టి నేను కూడా రిటైర్‌ అవుతున్నా’ అని బషీర్‌ వ్యాఖ్యానించాడు.


Tags :
|
|
|

Advertisement