Advertisement

  • ఎల్‌ఓసీ వద్ద పాక్‌ సైనికుల కాల్పులు...భయాందోళనలో ప్రజలు

ఎల్‌ఓసీ వద్ద పాక్‌ సైనికుల కాల్పులు...భయాందోళనలో ప్రజలు

By: chandrasekar Sat, 10 Oct 2020 5:04 PM

ఎల్‌ఓసీ వద్ద పాక్‌ సైనికుల కాల్పులు...భయాందోళనలో ప్రజలు


పాకిస్థాన్‌ నిన్న సాయంత్రం జమ్ముకశ్మీర్‌ పూంచ్‌ జిల్లాలోని షాపూర్‌, కిర్ని, కుస్బా సెక్టార్లలో మరోసారి కాల్పులకు పాల్పడింది. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల సమయంలో పాక్‌ సైనికులు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట ఆయుధాలతో కాల్పులు జరిపి, మోర్టార్లతో షెల్లింగ్స్‌ చేశారు.

భారత సైనికులు ధీటుగా స్పందించడంతో వెనక్కు తగ్గారు. కొన్నినెలల నుంచి పాకిస్థాన్‌ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘిస్తోంది. పూంచ్‌, రాజౌరీ, మాన్‌కోట్ సెక్టార్లలో వరుస కాల్పులకు పాల్పడుతుండటంతో సరిహద్దు వెంట ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Tags :
|
|
|

Advertisement