Advertisement

సరిహద్దులో పాక్‌ కాల్పులు..

By: chandrasekar Tue, 01 Dec 2020 5:47 PM

సరిహద్దులో పాక్‌ కాల్పులు..


పాకిస్థాన్‌ సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. నియంత్రణ రేఖ వెంట కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ భారత సైనికులు, సాధారణ పౌరులే లక్ష్యంగా కాల్పులు జరుపుతోంది.

జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో పాక్‌ సైనికులు సోమవారం ఇంకోసారి కాల్పులకు పాల్పడ్డారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో చిన్న ఆయుధాలతో భారత భద్రతా దళాలపైకి కాల్పులు జరిపి మోర్టార్లతో షెల్లింగ్స్‌ చేశారు.

భారత జవాన్లు ధీటుగా స్పందించడంతో తోక ముడిచారు. ఈ నెల 27న రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ వెంట పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

Tags :
|
|
|
|

Advertisement