సరిహద్దులో పాక్ కాల్పులు..
By: chandrasekar Tue, 01 Dec 2020 5:47 PM
పాకిస్థాన్ సరిహద్దులో
కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. నియంత్రణ రేఖ వెంట కాల్పుల ఉల్లంఘనకు
పాల్పడుతూ భారత సైనికులు, సాధారణ పౌరులే లక్ష్యంగా కాల్పులు జరుపుతోంది.
జమ్మూకాశ్మీర్లోని పూంచ్
సెక్టార్లో పాక్ సైనికులు సోమవారం ఇంకోసారి కాల్పులకు పాల్పడ్డారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో చిన్న ఆయుధాలతో భారత భద్రతా దళాలపైకి
కాల్పులు జరిపి మోర్టార్లతో షెల్లింగ్స్ చేశారు.
భారత జవాన్లు ధీటుగా
స్పందించడంతో తోక ముడిచారు. ఈ నెల 27న రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ వెంట పాక్ సైన్యం
జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
Tags :
pak |
firing |
on the |
border |