Advertisement

నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ కాల్పులు..

By: chandrasekar Tue, 29 Sept 2020 7:10 PM

నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ కాల్పులు..


సరిహద్దుల్లో పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి అతిక్రమించింది. ఇటీవల వరుసగా సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ బలగాలు కాల్పులకు పాల్పడుతోంది.

తాజాగా సోమవారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మచ్‌హల్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట సోమవారం పాక్‌ సైన్యం కాల్పులు జరిపింది. ఇందులో భారత సైన్యానికి చెందిన జవాన్‌ ఒకరు గాయపడ్డాడని ఇండియన్‌ ఆర్మీ పేర్కొంది.

అయితే సైనికుడికి ఏం ప్రమాదం లేదని, ఆరోగ్యంగా నిలకడగా ఉందని తెలిపింది. ‘కుప్వారాలోని మచ్‌హల్‌ సెక్టార్‌లో ఎల్‌ఓసీ వెంట పాక్‌ ఈ ఉదయం మోర్టార్లు, ఇతర ఆయుధాలతో కాల్పుల జరిపి, ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

దీనికి సరైన సమాధానం ఇస్తున్నామని, గాయపడిన సైనికుడి పరిస్థితి నిలకడగా ఉందని’భారత సైన్యానికి చెందిన చినార్‌ కార్ప్స్‌ ఓ ట్వీట్‌లో పేర్కొంది.

Tags :
|
|
|

Advertisement