Advertisement

  • డ్ర‌గ్‌ను ర‌వాణా చేస్తూ ప‌ట్టుప‌డిన పేస‌ర్ షెహాన్ మ‌ధుశంక

డ్ర‌గ్‌ను ర‌వాణా చేస్తూ ప‌ట్టుప‌డిన పేస‌ర్ షెహాన్ మ‌ధుశంక

By: chandrasekar Wed, 27 May 2020 10:51 AM

డ్ర‌గ్‌ను ర‌వాణా చేస్తూ ప‌ట్టుప‌డిన పేస‌ర్ షెహాన్ మ‌ధుశంక


అక్ర‌మాల‌కు పాల్ప‌డిన క్రికెట‌ర్‌పై శ్రీలంక క్రికెట్ బోర్డు క‌న్నెర్ర చేసింది. డ్ర‌గ్స్‌తో దొరికిన మ‌ధుశంక‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. అక్ర‌మంగా డ్ర‌గ్‌ను ర‌వాణా చేస్తూ ప‌ట్టుప‌డిన పేస‌ర్ షెహాన్ మ‌ధుశంక‌పై శ్రీలంక‌న్ క్రికెట్ చ‌ర్య‌లు తీసు‌కుంది. అన్ని ఫార్మాట్ల నుంచి త‌క్ష‌ణ‌మే అత‌డిని స‌స్పెండ్ చేస్తున్నట్లు తాజాగా ప్ర‌క‌టించింది. లంక‌లో సోదాలు నిర్వ‌హిస్తుండ‌గా, కారులో వెళుతున్న మ‌ధుశంక వ‌ద్ద రెండు గ్రాముల హెరాయిన్ లభించింది. దీంతో వెంట‌నే అత‌డిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజ‌రు పరిచారు. వ‌చ్చేనెల 2 వ‌ర‌కు కోర్టు రిమాండ్ విధించింది.

శ్రీలంకలో ఒక కాంట్రాక్టు క్రికెట‌ర్ డ్ర‌గ్స్‌తో దొర‌క‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. 2017 అరంగేట్ర వ‌న్డేలోనే మ‌ధుశంక సంచ‌లనం సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసి స‌త్తాచాటాడు. దీంతో ఈ ఘ‌న‌త సాధించిన నాలుగో ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. ఎంతో ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉన్న మ‌ధుశంక గాయాలతో జ‌ట్టు నుంచి చోటు కోల్పోయాడు. ఇప్ప‌టివ‌ర‌కు లంక త‌ర‌పున ఒక‌వ‌న్డే, రెండు టీ20లను మాత్ర‌మే మ‌ధుశంక‌ ఆడాడు. మ‌రోవైపు ఒక ఇంట‌ర్నేష‌నల్ క్రికెట‌ర్ డ్ర‌గ్స్ ర‌వాణా చేస్తూ ప‌ట్టుబ‌డ‌టం లంక‌లోనే గాకుండా ప్ర‌పంచవ్యాప్తంగాను సంచ‌ల‌నం రేకెత్తించింది. దీంతో వెంట‌నే స్పందించిన ఎస్ఎల్‌సీ మ‌ధుశంక‌పై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది

Tags :
|
|

Advertisement