రాజమండ్రి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక జర్నలిస్ట్ మృతి
By: chandrasekar Fri, 24 July 2020 3:19 PM
తూర్పు గోదావరి జిల్లా
రాజమండ్రిలో ఓ సీనియర్ జర్నలిస్ట్ ఆక్సిజన్ అందక మృత్యువాత పడిన ఘటన చోటు చేసుకుంది.
రాజమండ్రి రూరల్ పరిధిలో రాము (52)
అనే జర్నలిస్టు పదేళ్లుగా ఓ న్యూస్ ఛానెల్లో
విలేకరిగా పనిచేస్తున్నారు.
వారం రోజుల కిందట ఆయన
ప్రాణాంతక కరోనా బారిన పడ్డారు. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయణ్ని
చికిత్స కోసం రాజమండ్రి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కరోనాకు చికిత్స
తీసుకుంటున్న రాముకు శ్వాస సమస్య తీవ్రమైంది.
శ్వాస తీసుకోవడం
ఇబ్బందిగా మారి తల్లడిల్లిపోతున్న బాధితుడి గురించి స్థానిక విలేకరులు పదే పదే
అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఆక్సిజన్ కొరత తీర్చడంలో విఫలమయ్యారని బంధువులు
ఆరోపిస్తున్నారు. అవసరమైన ఆక్సిజన్లో 10 శాతం కూడా సరఫరా చేయలేకపోయారని తెలిపారు. దీంతో రాము
విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచారని చెప్పారు.
జర్నలిస్టు రాము మృతి
పట్ల విలేకరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ఆక్సిజన్ అందుబాటులో ఉంచకపోతే రోగులు పిట్టల్లా రాలిపోయే
ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఆస్పత్రిలో పదుల సంఖ్యలో
కరోనా బాధితులది ఇదే పరిస్థితి అని చెబుతున్నారు.