వలస కూలీలకు ఆఫర్స్ ఇస్తున్న యాజమాన్యాలు
By: Sankar Wed, 24 June 2020 3:46 PM
కరోనా కారణంగా బాగా నష్టపోయింది అంటే వలసకూలీలు ..వారు కేవలం ఆర్థికంగానే కాక మానసికంగా కూడా చాలా దెబ్బతిన్నారు ..ఒక్కసారిగా వచ్చిన కరోనా మహమ్మారి తో దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో వలస కూలీలు అనేక ఇబ్బందులు పడుతూ సొంత ప్రాంతాలకు చేరుకున్నారు ..ఇప్పటికి ఇంకా చాలామంది వెళ్తూనే ఉన్నారు ..అయితే కరోనా లాక్ డౌన్ సడలింపులు ఎత్తివేయడంతో మల్లి అన్ని పనులు ప్రారంభం అవుతున్నాయి ..దీనితో వలస కూలీలా అవసరం ఏర్పడుతుంది ..
దీంతో ఆయా సంస్థల యజమానులు గతంలో తమ దగ్గర పనిచేసిన కూలీలను, కార్మికులను తిరిగి రప్పించేందుకు పలు అవస్థలు పడుతున్నాయి. ఇందుకోసం వారికి పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అలాగే వలస కూలీలు వెళ్లిన గ్రామ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూ, వారిని తిరిగి రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ దగ్గరకు తిరిగివస్తే వారి భద్రతకు భరోసా కల్పిస్తామని, వారు ఇక్కడకు వచ్చేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేస్తామని చెబుతున్నట్లు సమాచారం.
ముంబైకి చెందిన ఒక ఫార్మా సంస్థ గత మూడు నెలల్లో కార్మికులు అందుబాటులో లేక పలు ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో ఆ కార్మికులను సంప్రదించి, వారు తిరిగి వచ్చేందుకు బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ఇదేవిధంగా మరికొన్ని కంపెనీలు కార్మికులను తిరిగి రప్పించేందుకు వారికి విమానయాన సౌకర్యాలు కూడా కల్పించేందుకు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది.