Advertisement

  • ఇంటి పక్కన వారికీ కరోనా వచ్చింది అని ఇంటికి తాళం వేసి వెళ్లిన ఫ్యామిలీకి షాకిచ్చిన దొంగలు

ఇంటి పక్కన వారికీ కరోనా వచ్చింది అని ఇంటికి తాళం వేసి వెళ్లిన ఫ్యామిలీకి షాకిచ్చిన దొంగలు

By: Sankar Tue, 08 Sept 2020 8:55 PM

ఇంటి పక్కన వారికీ కరోనా వచ్చింది అని ఇంటికి తాళం వేసి వెళ్లిన ఫ్యామిలీకి షాకిచ్చిన దొంగలు


మనకు తెలిసిన వారికీ ఎవరికీ అయిన కరోనా పాజిటివ్ వచ్చింది అంటే చాలు అప్పటిదాకా వారితో ఎంత కలిసి ఉన్న కూడా వెంటనే దూరం పెట్టేస్తున్నాము..కరోనాతో యుద్ధం చేయాలి కానీ రోగితో కాదని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నా కొందరిలో భయం వీడడం లేదు.తమకు తెలిసిన వారికో పక్కింటి వారికో కరోనా వచ్చిందని తెలియగానే అతిజాగ్రత్త పడిపోయి లేనిపోని సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు..

తాజాగా అలాంటి ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పక్కింట్లో కరోనా వచ్చిందని ఓ కుటుంబం తమ ఇంటికి తాళం వేసి ఊరెళ్లి 15 రోజుల తర్వాత తిరిగొచ్చేసరికి ఊహించని షాక్ తగిలింది. ఇంటిని దొంగలు దోచేయడంతో కంగుతిన్నారు. తాడేపల్లి పట్టణంలోని అమరారెడ్డి నగర్‌కి చెందిన ఓ వ్యక్తి తన పక్కింట్లో కరోనా వచ్చిందని ఇంటికి తాళాలు వేసి కుటుంబంతో సహా ఊరెళ్లిపోయాడు.

పదిహేను రోజులు గడిచాక తిరిగి ఇంటికి రావడంతో తలుపులు బద్దలు కొట్టి కనిపించాయి. కంగారుగా లోపలికి వెళ్లి చూసి కంగుతిన్నాడు. ఇంట్లో ఉంచిన బంగారు ఆభరణాలు దోచుకున్నట్లు గ్రహించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇంట్లో ఉంచిన యాభై గ్రాముల బంగారం చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగతనం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు

Tags :
|
|
|

Advertisement