Advertisement

  • ధర్నాకు దిగిన ఉస్మానియా ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

ధర్నాకు దిగిన ఉస్మానియా ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

By: Sankar Wed, 12 Aug 2020 5:21 PM

ధర్నాకు దిగిన ఉస్మానియా ఆసుపత్రి  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు



నాలుగు నెలలుగా ఇవ్వాల్సిన జీతాలు వెంటనే చెల్లించాలంటూ ఉస్మానియా ఆసుపత్రి కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆసుపత్రి ప్రాంగంణలో బుధవారం ధర్నాకు దిగారు.ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి తమకు వేతనాలు పెంచి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నామని, అయినా సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి ఉన్నా సరే తమ ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తున్నామన్నారు. అయినప్పటికి ప్రభుత్వం తమ బతుకులతో ఆడుకుంటుందని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి, గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు పెంచినట్లే తమకు వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు.

కాగా ఇప్పటికే గాంధీ ఆసుపత్రి , నిమ్స్ లో పనిచేసే ఔట్సోఅర్చింగ్ ఉద్యోగులు జీతాల పెంపు గురించి ధర్నాకు దిగిన విషయం తెలిసిందే ..అయితే ప్రభుత్వం వారి డిమాండ్ పట్ల సానుకూల వైకరిని ప్రదర్శించి జీతాలు పెంచింది..దీనితో ఉస్మానియా లో పనిచేసే వారు కూడా జీతాలు పెంచాలని డిమాండ్ చేసారు..

Tags :
|

Advertisement