ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలని భావించే స్టూడెంట్స్కు సువవకాశం
By: chandrasekar Mon, 27 July 2020 7:40 PM
ప్రస్తుతం మంచి కాలేజీలో
డిమాండ్ ఉన్న కోర్సు చదవాలంటే రూ.లక్షల్లో ఫీజు చెల్లించుకోవాలి. మధ్యతరగతికి
అయితే పిల్లల చదువు భారంగా మారుతోంది. అయితే ఇక్కడ ఏపీ వంటి రాష్ట్రాలు
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తున్న విషయం తెలిసిందే. పిల్లల ఉన్నత
చదువు కోసం చాలా మంది ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేసుకుంటూ ఉంటారు. దీని కోసం
బ్యాంకుల చుట్టూ తిరుగుతారు. అయితే ఎడ్యుకేషన్ లోన్ కోసం బ్యాంక్కు కూడా
వెళ్లాల్సిన పని లేదు.
కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ను
అందుబాటులో ఉంచింది. దీని ద్వారా సులభంగానే ఎడ్యుకేషన్ లోన్ పొందొచ్చు. www.vidyalakshmi.co.in వెబ్సైట్ ద్వారా స్టూడెంట్స్ లోన్ కోసం అప్లై
చేసుకోవచ్చు. దాదాపు 36 బ్యాంకులు ఈ పోర్టల్లో రిజిస్టర్ అయ్యాయి. అందువల్ల
మీరు నచ్చిన బ్యాంక్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ పొందొచ్చు. అన్ని బ్యాంకుల ఆఫర్లు ఒకే
చోటు అందుబాటులో ఉంటాయి.
నేషనల్ సెక్యూరిటీస్
డిపాజిటరీ (NSDL) ఇగవర్నెన్స్ ఇన్ౠఫ్రాస్ట్రక్చర్ ఈ వెబ్సైట్ నిర్వహణ
బాధ్యతలు చూసుకుంటోంది. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలని భావించే వారు ముందుగా ఈ వెబ్సైట్కు
వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఒక ఫామ్ను ఫిల్ చేయాలి. తర్వాత లోన్కు
అప్లై చేసుకోవాలి. కేవలం లోన్ మాత్రమే కాకుండా విద్యార్థులు స్కాలర్షిప్ కోసం ఈ
వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.