ఒప్పో ఏ12ఎస్ స్మార్ట్ ఫోన్ లాంచ్
By: chandrasekar Wed, 15 July 2020 6:05 PM
మార్కెట్లో ఒప్పో మరో
స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అదే ఒప్పో ఏ12ఎస్ స్మార్ట్ ఫోన్. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్
ను ఇందులో అందించారు. వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ఇందులో ఉంది. 4350
ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఇందులో అందించారు. ఒప్పో ఏ12 తరహాలోనే
స్పెసిఫికేషన్లు ఇందులో అందించారు. ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్
అందుబాటులో ఉంది. 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా ఇందులో అందించారు.
స్పెసిఫికేషన్లు:
దీనిలో 6.2
అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. స్క్రీన్ టు బాడీ రేషియో 88.3
శాతంగా ఉంది. 2.3 గిగాహెర్ట్జ్ మీడియాటెక్ హీలియో పీ35
ఆక్టాకోర్ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3 జీబీ ర్యామ్,
32 జీబీ స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉంది.
స్టోరేజ్ ను మైక్రో ఎస్
డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఒప్పో ఏ12ఎస్
స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా
సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్
సామర్థ్యమున్న మరో కెమెరా కూడా ఉంది.
ఇందులో ముందువైపు 5 మెగా
పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఏఐ బ్యూటీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఒప్పో
అందించింది. ఈ ఫోన్ లో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే ఫేస్ అన్
లాక్ సపోర్ట్ కూడా దీనికి ఉంది. ఇందులో 4230 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
ఒప్పో ఏ12ఎస్ ధర
ఒప్పో స్మార్ట్ ఫోన్ మొదట
కాంబోడియాలో లాంచ్ అయింది. ఇందులో కేవలం 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒక్కటి మాత్రమే అందుబాటులో
ఉంది. దీని ధరను సుమారుగా రూ.9,700
నిర్ణయించారు. బ్లూ, గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది.