Advertisement

ఎస్పీ బాలు పాడిన చివరి సినిమా పాట ఏదో తెలుసా !

By: Sankar Fri, 25 Sept 2020 4:24 PM

ఎస్పీ బాలు పాడిన చివరి సినిమా పాట ఏదో తెలుసా !

గాన గంధర్వుడు ఎస్పీ బాలు మరణం ఎందరో కోట్లాది మంది అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ఓ గాయకుడు 16 భాషల్లో 40 వేల పాటలు పాడడం అంటే మామూలు విషయం కాదు.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనదైన శైలిలో పాటలు పాడిన ఆయన ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

తన గాత్రంతో సినీ సంగీత అభిమానులను ఓలలాడించారు. ఇక, ఎవ్వరూ.. ఎప్పటికీ భారతీయ సినీ ప్రపంచంలో ఈ అరుదైన ఘనతను సాధించడం సాధ్యం కాదనే చెప్పాలి. అయితే, అనారోగ్య సమస్యలతో 40 రోజుల క్రితం ఆస్పత్రిలో చేరి ఇవాళ కన్నుమూసిన ఆయన.. పాడిన చివరి పాట ఏంటి? అనే ప్రశ్న అందరినీ వెంటాడుతోంది..

‘పలాస 1978’ సినిమాలోని ‘ఓ సొగసరి’ అనే పాటనే ఆయన ఆలపించిన చివరి పాట అని చెబుతున్నారు.. లక్ష్మీ భూపాల రాసిన పాటను రఘు కుంచె సంగీతాన్ని అందించారు.. ఎస్పీ బాలు, బేబి కలిసి ఈ పాటను ఆలపించారు. ఇక, దీనిపై మ్యూజిక్ డైరెక్టర్‌ రఘు కుంచె మాట్లాడుతూ.. పలాస చిత్రంలో బాలు పాట పాడడం తన అదృష్టంగా చెప్పుకొచ్చారు.

Tags :

Advertisement