మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేది టీఆర్ఎస్ మాత్రమే: అభ్యర్థి సోలిపేట సుజాత
By: chandrasekar Mon, 19 Oct 2020 10:07 AM
ప్రజలకు ఎల్లవేళలా
అందుబాటులో ఉండేది టీఆర్ఎస్ మాత్రమేనని తెలిపిన తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత.
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత దూసుకెళ్తున్నది.
ఆదివారం చేగుంట మండలంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే
పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ
ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేది టీఆర్ఎస్
నాయకులేనని తెలిపారు.
ఉప ఎన్నికల్లో భాగంగా
బీజేపీ, కాంగ్రెస్
నాయకులు గుడి కట్టిస్తాం, గోడ కట్టిస్తాం అంటూ ఎన్నో మాటలు చెప్తారు. అలాంటి
వారి మాటలు నమ్మొద్దన్నారు. సుజాతక్క మీ ముందుకు వచ్చింది. కారు గుర్తుకు ఓటేసి
గెలిపించండని ప్రజలను కోరారు. సుజాత మాట్లాడుతూ మీకు ఎల్లప్పుడు అందుబాటులో
ఉంటానని తెలిపారు.
దుబ్బాక ప్రజలకు సేవ చేసే
అవకాశం కల్పించండని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మీ ముందుకు
వచ్చాను మీకు కావలసిన అవసరాలు తీర్చి ఎల్లప్పుడూ మీవెంటే ఉంటానని తెలిపారు. దివంగత
రామలింగారెడ్డిలాగే దుబ్బాకను మంత్రి హరీశ్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి
సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.