రూపాయికే క్వార్టర్ మద్యం... మద్యం బాబులు పండుగ చేసుకున్నారు...!
By: Anji Mon, 16 Nov 2020 9:18 PM
మద్యం బాబులు పండుగ చేసుకున్నారు. దీపావళి పండుగ అనుకునేరు సుమీ… కాదు కాదు.. ఫుల్లుగా తాగి తూగారు. అంతే కాదు వారం రోజులకు సరిపడేలా దాచుకున్నారు.
అయితే ఇది రోజు జరిగేదేగా అనుకుంటున్నారా.. అయితే చదవండి. మద్యం ధరలు కొద్దిగా తగ్గితే చాలు పెద్ద ఎత్తున ఎగబడి కొనుగోలు చేస్తారు.
అలాంటిది రూపాయికే క్వార్టర్ మద్యం అంటే మందుబాబులు చూస్తూ ఊరుకుంటారా… ఒక్కొక్కరు పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేసి పెట్టుకుంటారు. ఇంతకీ ఈ అఫర్ ఎక్కడ ప్రకటించారు. అనే కదా మీ ప్రశ్న…
సినీ దర్శకుడు ఎన్ శంకర్ పై ఉన్న అభిమానంతో అయన పెళ్లి రోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చింతకుంట విష్ణు తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్లో ఉన్న ఎస్వీ వైన్ షాప్లో గంటపాటు క్వార్టర్ మద్యంను ఒక్కరూపాయికే అందించారు. రూపాయికే మద్యం ఇస్తున్నారని తెలుసుకున్న మందుబాబులు ఆ వైన్ షాప్ ముందు పెద్ద ఎత్తు క్రమశిక్షణతో క్యూ కట్టారు.
అయితే.. క్యూలో నిలబడ్డవారికి టోకెన్లు ఇచ్చారు. ఇక్కడే ట్విస్ట్ జరిగింది. ఈ ఆఫర్ను కేవలం 45 మంది మాత్రమే దక్కించుకోగలిగారు.