Advertisement

గ్రేటర్‌లో దారుణంగా పడిపోయిన పోలింగ్ శాతం...!

By: Anji Tue, 01 Dec 2020 7:30 PM

గ్రేటర్‌లో దారుణంగా పడిపోయిన పోలింగ్ శాతం...!

గ్రేటర్‌లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. హైదరాబాద్‌లో ఎన్నడూ లేనంతంగా పోలింగ్ శాతం దారుణంగా తగ్గింది. సాయంత్రం నాలుగు గంటల వరకు కేవలం 30శాతం మాత్రమే ఓటింగ్ నమోదు అయ్యింది.

అరగంట వరకు క్యూ లైన్‌లో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. ఈనెల నాల్గవ తేదీన గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

మరోవైపు ఎల్లుండి ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్ నిర్వహించనున్నారు. గుర్తులు తారుమారు కావడంతో ఓల్డ్ మలక్‌పేటలో పోలింగ్‌ను అధికారులు రద్దు చేశారు.

Tags :

Advertisement