ఆన్ లైన్ లోన్ యాప్స్ ప్రధాన నిందితుడు అరెస్ట్ ..
By: Sankar Wed, 30 Dec 2020 10:31 PM
ఆన్లైన్ లోన్ యాప్స్ కేసులో పోలీసులు బుధవారం పురోగతి సాధించారు. ఈ కేసులో చైనాకు చెందిన కీలక నిందితుడు లాంబో (27) అరెస్ట్ చేశారు. దేశం వదిలి పారిపోతుండగా లాంబోను ఢిల్లీ ఎయిర్పోర్టులో పోలీసులు పట్టుకున్నారు. అక్కడి నుంచి అతడిని హైదరాబాద్ తీసుకొచ్చారు.
నాలుగు కంపెనీల ద్వారా లాంబో లోన్యాప్స్ నడుపుతున్నట్లు, కాల్ సెంటర్ల ద్వారా అప్పు తీసుకున్న వ్యక్తులను యాప్ నిర్వాహకులు వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్ సెంటర్ల నిర్వహణలో నిందితుడికి సాయం చేసిన కర్నూలుకు చెందిన నాగరాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గత 6 నెలల్లో రూ.21 వేల కోట్ల వ్యాపారం చేసినట్లు పోలీసులు గుర్తించారు.కాగా ఆన్లైన్ లోన్ యాప్ లలో రుణాలు తీసుకోని గత కొంతకాలంగా తెలంగాణాలో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే..దీనితో పోలీసులు ఈ ఇన్స్టంట్ లోన్ యాప్ మీద కొరడా జులిపించారు...