Advertisement

  • సెప్టెంబర్ ఒకటి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

సెప్టెంబర్ ఒకటి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

By: chandrasekar Tue, 25 Aug 2020 8:40 PM

సెప్టెంబర్ ఒకటి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి


కరోనా కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూత పడడంతో సెప్టెంబ‌ర్ ఒక‌టి నుంచి ఇంటర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గతులు నిర్వహించనున్నట్లు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. సెప్టెంబ‌ర్ ఒక‌టి నుంచి ఇంటర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గతులు ప్రారంభం అవుతాయ‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి వెల్ల‌డించారు. వీరితో పాటు, డిగ్రీ, పీజీ విద్యార్థుల‌కు కూడా అదే రోజు నుంచి ఆన్‌లైన్ బోధ‌న ప్రారంభం అవుతుంద‌ని ఆమె స్పష్టం చేశారు. అలాగే పాఠ‌శాల విద్యార్థుల‌కు కూడా డిజిట‌ల్ బోధ‌న ఉంటుంద‌ని తెలిపారు. దీని కోసం అధ్యాప‌కులు, ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ పూర్తి చేశామ‌ని తెలిపారు. విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా విద్యాబ్యాసం నేర్పుటకు కావలసిన శిక్షణను అందించినట్లు తెలిపారు.

రాష్ట్రంలో అధ్యాప‌కులు ఈ నెల‌ 27 నుంచే కళాశాలల‌కు వెళ్ళాల‌ని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 5న‌ రాధాకృష్ణ జయంతి కార్యక్రమం, ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం కూడా ఉంటుంద‌ని మంత్రి తెలిపారు. ఈ మేర‌కు విద్యాశాఖ మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇదిలా వుండ‌గా వ‌చ్చే నెల 1 నుంచి పాఠ‌శాల విద్యార్థుల‌కు కూడా ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. కరోనా వైరస్ కు వాక్సిన్ వచ్చి దాని ప్రభావం తగ్గిన తరువాత పాఠశాలలు పునః ప్రారంభం కానున్నట్లు అందరూ భావిస్తున్నారు.

Tags :
|

Advertisement