Advertisement

  • ఏపీలో శుక్రవారం నుండి రైతుబజార్లలో కిలో రూ.40కి ఉల్లిపాయలు

ఏపీలో శుక్రవారం నుండి రైతుబజార్లలో కిలో రూ.40కి ఉల్లిపాయలు

By: chandrasekar Thu, 22 Oct 2020 09:12 AM

ఏపీలో శుక్రవారం నుండి రైతుబజార్లలో కిలో రూ.40కి ఉల్లిపాయలు


దేశంలో పలు చోట్ల వర్షాలు కారణంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. దిగుబడులు తక్కువగా ఉండడంతో ధరలు భారీగా పెరిగాయి.రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లోని రైతుబజార్లలో శుక్రవారం నుంచి సబ్సిడీ ధరపై ఉల్లిపాయలు విక్రయించనున్నారు. అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి ధరలు మండిపోతున్నాయి.

ఇందువల్ల బుధవారం అనేక పట్టణాల్లోని రిటైల్‌ మార్కెట్లలో కిలో రూ.90 నుంచి రూ.100 వరకు అమ్మకాలు జరిగాయి. ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలుండటంతో రాష్ట్ర ప్రభుత్వం హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఉల్లిపాయలు కొనుగోలు చేసి రైతుబజార్లలో సబ్సిడీ ధరకు విక్రయించాలని నిర్ణయించింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం కర్నూలు, తాడేపల్లిగూడెం హోల్‌సేల్‌ మార్కెట్లలో ఉల్లిపాయలు కొనుగోలు చేయనుంది. ఆ మార్కెట్‌లలో ఎంతకు కొనుగోలు చేసినా రైతుబజార్లలో కిలో రూ.40కి అమ్మాలని నిర్ణయించింది. రెండోదశలో రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో ఉల్లిపాయలు అమ్మడానికి చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎస్‌.ప్రద్యుమ్న చెప్పారు. ఇందువల్ల పేద మరియు మధ్య తరగతి పరాజయాలకు లాభం చేకూరుతుంది.

Tags :
|

Advertisement