ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి
By: chandrasekar Wed, 03 June 2020 3:11 PM
ఏపీలో కరోనా ఉధృతి
కొనసాగుతోంది. లోకల్ కాంటాక్ట్, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా రోజు రోజుకు
పాజిటివ్ క కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 12,613 శాంపిల్స్ను పరీక్షించగా 82 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు మీడియా బులిటెన్లో
వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర కేసులు 33 ఉన్నాయి. మొత్తం కలిపితే 115
నమోదయ్యాయి. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం
తెలియజేయలేదు.
తాజా కేసులు కలిపితే
మొత్తం సంఖ్య 3200కు చేరాయి. మరో 40మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో
డిశ్చార్జ్ కాగా రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 927కు చేరింది. రాష్ట్రంలో
అత్యధికంగా కర్నూలు జిల్లాలో 700పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు
జిల్లాలో 400కు పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి
వరకు 2209మందికి
నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా
కరోనాతో మొత్తం 64మంది చనిపోయారు.
గత 24
గంటల్లో కోవిడ్ వల్ల ఎవరూ చనిపోలేదు. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో చిత్తూరు, నెల్లూరు
జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు
మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో కూడా
కొన్ని కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో కొత్త నమోదైన
పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 479 వీటిలో యాక్టివ్ కేసులు 282
ఉన్నాయని ప్రకటించారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన 112మందికి వైరస్ సోకినట్లు
తెలియజేశారు. అయితే కోయంబేడు లింకులతో పాటూ విదేశాల నుంచి వచ్చిన వారితో టెన్షన్
వెంటాడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.