Advertisement

  • కాశ్మీర్ లో ఉగ్రదాడి ..ఒక పోలీస్ , ఇద్దరు జవాన్ లు మృతి

కాశ్మీర్ లో ఉగ్రదాడి ..ఒక పోలీస్ , ఇద్దరు జవాన్ లు మృతి

By: Sankar Mon, 17 Aug 2020 11:25 AM

కాశ్మీర్ లో ఉగ్రదాడి ..ఒక పోలీస్ , ఇద్దరు జవాన్ లు మృతి


జమ్మూ కశ్మీర్‌‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. బారాముల్లా జిల్లాల్లో ఉగ్రమూకలు కాల్పులకు పాల్పడి ముగ్గుర్ని పొట్టనబెట్టుకున్నాయి.

ఈ ఘటనలో పోలీస్ అధికారి సహా ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. బారాముల్లాలోని సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసుల సంయుక్త బలగాలపై ఉగ్రవాదులు సోమవారం తెల్లవారుజామున ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ కాల్పుల్లో జమ్మూ కశ్మీర్‌ పోలీస్ అధికారి, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన సైన్యం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టింది.

ఉగ్రవాదుల కోసం సైన్యం వేట కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీస్ అధికారి ఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన సీఆర్పీఎఫ్ జవాన్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని జమ్మూ కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ వెల్లడించారు. పలు రౌండ్ల పాటు ముష్కరులు కాల్పులు జరిపి, పరారయ్యారని తెలిపారు.

Tags :
|
|
|
|

Advertisement