బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పేరును వన్ ప్లస్ నార్డ్ గా నిర్ణయించిన వన్ ప్లస్
By: chandrasekar Thu, 02 July 2020 7:35 PM
వన్ ప్లస్ తన బడ్జెట్
స్మార్ట్ ఫోన్ పేరును వన్ ప్లస్ నార్డ్ గా నిర్ణయించింది. దీనికి సంబంధించిన
ప్రీ-ఆర్డర్లు కూడా కొన్ని దేశాల్లో ప్రారంభమైంది. ఈ ఫోన్ క్వాల్ కాం స్నాప్
డ్రాగన్ 765జీ
ప్రాసెసర్ తో పనిచేస్తుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ తెలిపారు. టెక్
రాడార్ కథనం ప్రకారం కార్ల్ పెయ్ ఈ ఫోన్ లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీతో
పనిచేస్తుందని తెలిపారు.
క్వాల్ కాం స్నాప్
డ్రాగన్ 765జీ
ప్రాసెసర్ ఫ్లాగ షిప్ 800 సిరీస్ ప్రాసెసర్ల స్థాయిలో శక్తివంతమైంది కాకపోయినా
మిడ్ రేంజ్ ఫోన్ల పనితీరును తగ్గనివ్వదు. మిడ్ రేంజ్ ఫోన్లలో 5జీ
ప్రాసెసర్ ను కూడా అందించినట్లు ఉంటుంది. ఇక ఈ ఫోన్ కెమెరాల గురించి కూడా కార్ల్
పెయ్ మాట్లాడారు.
ప్రస్తుతం స్మార్ట్
ఫోన్లలో ఎక్కువగా ఉపయోగించే ఫీచర్ ఇదేనని తెలిపారు. ఒక గొప్ప ఫోన్ ను లాంచ్
చేయాలంటే, అందులో
గొప్ప కెమెరా ఉండాల్సిందేనన్నారు. వన్ ప్లస్ నార్డ్ ద్వారా ఫ్లాగ్ షిప్ స్థాయి
కెమెరాను మిడ్ రేంజ్ ఫోన్లలో అందించనున్నట్లు తెలిపారు. వన్ ప్లస్ 8, వన్ ప్లస్
8 ప్రో
స్మార్ట్ ఫోన్లలో ఉండే కెమెరా ఫీచర్లు ఇందులో వున్నట్లు తెలిపారు.
ఈ వివరాలు తప్ప వీటికి
సంబంధించిన మిగతా సమాచారం ఏదీ లేదు. ముందుగా వచ్చిన లీకుల ప్రకారం ఇందులో 12 జీబీ
ర్యామ్, వెనకవైపు
నాలుగు కెమెరాల సెటప్, ముందువైపు డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్ అందుబాటులో
ఉంది. ఈ ఫోన్ ధర 500 డాలర్ల(సుమారు రూ.37,800) కంటే తక్కువగానే
ఉండనున్నట్లు సమాచారం.