Advertisement

  • చెన్నైలో రౌడీ షీటర్ ను కత్తితో దారుణంగా పొడిచి చంపిన మరొక రౌడీ గ్యాంగ్

చెన్నైలో రౌడీ షీటర్ ను కత్తితో దారుణంగా పొడిచి చంపిన మరొక రౌడీ గ్యాంగ్

By: Sankar Thu, 10 Sept 2020 6:04 PM

చెన్నైలో రౌడీ షీటర్ ను కత్తితో దారుణంగా పొడిచి చంపిన మరొక రౌడీ గ్యాంగ్


తమిళనాడు రాజధాని చెన్నైలో గ్యాంగ్ వార్ ఓ రౌడీషీటర్ హత్యకు దారితీసింది. రెండు గ్రూపులకు చెందిన వ్యక్తులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు.

ఈ క్రమంలో రౌడీషీటర్ రమేష్‌ను మరో రౌడీ గ్యాంగ్ దారుణంగా కత్తులతో నరికారు. నగరంలోని పులియంతోపుకి చెందిన రౌడీ షీటర్ రమేష్ ప్రత్యర్ధులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతను మృతి చెందిన విషయం ఖరారు చేసుకున్న వెంటనే రౌడీ గ్యాంగ్ అక్కడి నుంచి పరారైంది.

పలు హత్యలు, గంజాయి సరఫరా కేసులలో మృతుడు రమేష్ ప్రధాన నిందితుడని చెబుతున్నారు. నిన్న రాత్రి పులియంతోపులో జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రౌడీ గ్యాంగుల మధ్య ఉన్న విభేదాలు, సెటిల్ మెంట్ల వ్యవహారాలే రమేష్ హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన సమయంలో స్థానికులు భయంతో పరుగులు తీసినట్లు సీసీ పుటేజ్ లో క్లియర్ గా కనిపిస్తోంది.

Tags :

Advertisement