Advertisement

ఒకటే దేశం ..ఒకటే మార్కెట్ ..మోడీ సంచలన నిర్ణయం ..?

By: Sankar Mon, 01 June 2020 3:50 PM

ఒకటే దేశం ..ఒకటే మార్కెట్ ..మోడీ సంచలన నిర్ణయం ..?

దేశంలోని రైతులందరికీ తీపి కబురు అందించనుంది మోదీ ప్రభుత్వం. ‘వన్ నేషన్- వన్ మార్కెట్’ (ఒకే దేశం - ఒకే మార్కెట్) అన్న విధానాన్ని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సమాచారం. ఇకపై రైతులు పండించిన ఉత్పత్తులను ఎవరికైనా... ఎక్కడైనా మంచి ధర కోసం విక్రయించడానికి వీలుగా ఈ విధానాన్ని ఆర్డినెన్స్ రూపంలో తేనున్నట్లు సమాచారం.

ఢిల్లీలోని ఉన్నతాధికారులు అన్యాపదేశంగా ఈ మేరకు సంకేతాలిచ్చారు. మోదీ అధ్యక్షతన సోమవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. మోదీ రెండో యేడాదిలోకి అడుగు పెట్టిన తర్వాత మొదటి కేబినెట్ భేటీ ఇది. దీంతో పాటు చైనాతో కొనసాగుతున్న సరిహద్దు వివాదంపై కూడా కేంద్ర కేబినెట్ చర్చించనుంది. లాక్ డౌన్‌తో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.


modi,cnetral governament,one nation,one market,lockdown ,వన్ నేషన్,  వన్ మార్కెట్, మోదీ ,కేంద్ర ప్రభుత్వం,
కేంద్ర కేబినెట్

మరో వైపు మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సోమవారం ట్వీట్ చేశారు. భారత ప్రజాస్వామ్యంలోనే సువర్ణాధ్యాయాన్ని తెచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.శుభాకాంక్షలు ప్రధాని మోదీ గారూ... భారత ప్రజాస్వామ్యంలోకి సువర్ణాధ్యాయం తెచ్చినందుకు. కోవిడ్ కేసుల విషయంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానానికి వెళుతుంది. ఆర్థిక వ్యవస్థా కుప్పకూలుతుంది. వచ్చే ఏడాది దేశ పరిస్థితి మరింత అద్భుతంగా మారే అవకాశం ఉంది’’ అని ట్వీట్ చేశారు.

Tags :
|

Advertisement