Advertisement

  • సింగరేణి డంపర్ వాహనం ఓ వ్యక్తిపైకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి....!

సింగరేణి డంపర్ వాహనం ఓ వ్యక్తిపైకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి....!

By: Anji Tue, 15 Dec 2020 1:11 PM

సింగరేణి డంపర్ వాహనం ఓ వ్యక్తిపైకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి....!

సింగరేణి డంపర్ వాహనం బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ఓ వ్యక్తిపైకి డంపర్ దూసుకెళ్లింది. ఈ ఘటన జయశంకర భూపాలపల్లి జిల్లాలోని గడ్డిగానిపల్లిలో చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో జడల లింగయ్య మృతి చెందాడు. సింగరేణి కాకతీయ ఉపరితల గని సెక్టార్ వన్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంపై గ్రామస్తుల ఆందోళనకు దిగారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్‌లోకి గ్రామస్తులు చోరబడి పలు వాహనాలను ధ్వంసం చేశారు.
సింగరేణి ఓసి సేఫ్టీ ఆఫీస్ పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో ఓపెన్ కాస్ట్ గని పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

గ్రామస్తులు మృతికి కారకులైన వారిని గుర్తించాలని వెంటనే ఓపెన్ కాస్ట్ గని ని మూసివేయాలని లేనిపక్షంలో ఇలాగే ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు తెలుపుతున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Tags :

Advertisement