Advertisement

  • అమెరికాలో మరోసారి కాల్పుల మోత ...ఒకరు మృతి , ఎనిమిది మందికి గాయాలు

అమెరికాలో మరోసారి కాల్పుల మోత ...ఒకరు మృతి , ఎనిమిది మందికి గాయాలు

By: Sankar Mon, 20 July 2020 4:46 PM

అమెరికాలో మరోసారి కాల్పుల మోత ...ఒకరు మృతి , ఎనిమిది మందికి గాయాలు



అగ్ర రాజ్యం అమెరికా ఇటీవల కాలంలో ఎప్పుడు ఎదో ఒక అలజడితో వణుకుతుంది .ఇప్పటికే కరోనా కేసుల్లో అగ్ర స్థానం లో ఉన్న అమెరికా మరోవైపు వరుస కాల్పులతో అట్టుడికిపోతోంది ..ఇంకోవైపు నల్లజాతి నిరసనలు ఇలా 2020 లో అమెరికాకు ఏది కలిసిరావడం లేదు ..కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్థ పతనం అవుతుంటే కాల్పులతో అమెరికాలో ప్రజలకు ప్రశాంతత లేకుండా అయింది ..

తాజాగా వాషింగ్టన్‌ వాయవ్య ప్రాంతంలోని కొలంబియా హైట్స్ 14వ వీధి స్ప్రింగ్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం దుండగులు జరిపిన కాల్పుల్లో వ్యక్తి మృతి చెందగా.. మరో 8 మంది గాయపడినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. గాయపడిన వారి వివరాలను త్వరలో ధ్రువీకరిస్తామని పోలీసు ప్రతినిధి పేర్కొన్నారు.

కాల్పుల్లో గాయపడిన వారందరూ పెద్దలేనని చెప్పారు. దర్యాప్తు బృందం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించిందని, ఒకరు మరణించినట్లు ధ్రువీకరించిందని వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి ముగ్గురు ఆఫ్రికన్లు-అమెరికన్‌ పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని, వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వారిని పట్టుకునేందుకు యత్నిస్తున్నామని తెలిపారు.

Tags :

Advertisement