Advertisement

  • ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరి ప్రయాణికుల దగ్గర కోటి 90 లక్షలు లభ్యం

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరి ప్రయాణికుల దగ్గర కోటి 90 లక్షలు లభ్యం

By: Sankar Sun, 13 Dec 2020 9:57 PM

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరి ప్రయాణికుల దగ్గర కోటి 90 లక్షలు లభ్యం


కర్నూల్ సమీపంలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా డబ్బు పట్టుబడింది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో చేపట్టిన తనిఖీల్లో ఓ ఆర్టీసీ బస్సులో రూ.1.90 కోట్ల నగదు పట్టుబడింది.

అనంతపురంలోని మారుతినగర్‌కు చెందిన కోనేరు రామ చౌదరి, గుంతకల్‌కు చెందిన రంగనాయకులు హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు కుప్పం డిపో బస్సులో వస్తున్నారు. నిఘావర్గాల సమాచారంతో సీఐ లక్ష్మీదుర్గయ్య, సిబ్బంది బస్సును ఆపి తనిఖీ చేశారు.

అప్పటి వరకు తమ పక్కనే ప్రయాణించిన ఈ ఇద్దరి వద్ద కట్టల కొద్దీ డబ్బు ఉండటంతో చూసి ఆశ్చర్యపోవడం తోటి ప్రయాణికుల వంతైంది. నగదుకు సంబంధించి ఎలాంటి రశీదులు చూపకపోవడంతో సీజ్‌ చేసి కర్నూలు అర్బన్‌ పోలీసులకు అప్పగించారు. రామచౌదరిని విచారించగా పొలం కొనుగోలు కోసం హైదరాబాద్‌ వెళ్లామని, బేరం కుదరకపోవడంతో డబ్బుతో స్వగ్రామానికి వెళ్తున్నట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్నికోణాల్లో విచారణ జరుపుతున్నారు.

Tags :
|
|

Advertisement