బుధవారం మరో మూడు రఫెల్ యుద్ధ విమానాలు భారత్ అమ్ముల పొదిలో...
By: chandrasekar Wed, 04 Nov 2020 12:28 PM
అత్యాధునిక రఫెల్ యుద్ధ
విమానాలు ఫ్రాన్స్ నుండి భారత్ కు ఈ రోజు చేరుకోనున్నాయి. భారత వైమానిక దళం అమ్ముల
పొదిలో మరో మూడు రాఫెల్ జెట్ ఫైటర్లు రేపు చేరనున్నాయి. ఇప్పటికే ఐదు రఫెల్
జెట్లు భారత్ చేరుకుని వైమానిక దళంలో సేవలందిస్తున్నాయి. బుధవారం సాయంత్రం కల్లా
మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ రానున్నాయి. దీని రాకతో భారత వైమానిక దళం
మరింత బలోపేతం కానుంది.
ఇంతకు ముందు 5 యుద్ధ
విమానాలు భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మూడు విమానాలు రేపు
ఉదయం ఫ్రాన్స్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. సాయంత్రం హర్యానాలోని అంబాలా ఎయిర్బేస్కు
చేరుకోనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదనపు రఫెల్ విమానాల రాకతో భారత
వైమానిక దళానికి మరింత బలం చేకూరనున్నది. భారత్ ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాలను
చైనా సరిహద్దు ప్రాంతాల్లో కార్యాచరణ పాత్రలో మోహరించడం ప్రారంభించింది.
ఒప్పందంలో భాగంగా మొదటి
బ్యాచ్లో ఐదు రాఫెల్స్ విమానాలు జూలై 28 న భారతదేశానికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 10 న
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారికంగా వైమానిక దళంలో చేర్చుకున్నది. ఎన్డీఏ
ప్రభుత్వం 2016 లో ఫ్రాన్స్లోని రాఫెల్ సంస్థతో చేసుకున్న రూ.60 వేల
కోట్ల ఒప్పందం ప్రకారం మొత్తం 36 విమానాలు 2022 మధ్య నాటికి భారత్ చేరుకోనున్నాయి. దీనివల్ల అదనపు
బలం చేకూరుతుంది.