Advertisement

ఓంకార్ కి కరోనా సోకలేదు

By: chandrasekar Mon, 29 June 2020 6:22 PM

ఓంకార్ కి కరోనా సోకలేదు


క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకి విజృంభిస్తున్న నేప‌థ్యంలో అందరి గుండెల్లో గుబులు రేగుతుంది. సామాన్యుడు, సెల‌బ్రిటీ అనే తేడా లేకుండా క‌రోనా ప్ర‌తి ఒక్కరిపై పంజా విసురుతుంది.

అయితే ఒక‌వైపు కరోనా భ‌యం అంద‌రిని వ‌ణికిస్తుంటే, మ‌రోవైపు కొంద‌రు ప్ర‌బుద్దులు పుట్టించే పుకార్లు సెల‌బ్రిటీలు, వారి అభిమానుల‌ని ఆందోళ‌న‌కి గురి చేస్తున్నాయి.

శ‌నివారం ప్ర‌ముఖ యాంక‌ర్, ద‌ర్శ‌కుడు ఓంకార్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కి క‌రోనా సోకిందని జోరుగా ప్ర‌చారం చేశారు. ఓంకార్ ఈ నెల‌ 24న క‌రోనా బారిన ప‌డ్డార‌ని, అలాగే తన కుటుంబ సభ్యులు కూడా కరోనా సోకింద‌ని కథనాలు వెలువడ్డాయి.

త‌న‌కి క‌రోనా సోకింద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఓంకార్ స్పందించారు. తనకు తన కుటుంబానికి కరోనా సోకింది అనడంలో ఎటువంటి నిజం లేదని ఆయన చెప్పారు. తమ కుటుంబానికి కరోనా సోకిందన్న వార్తలలో ఎటువంటి నిజం లేదని స్ప‌ష్టం చేశారు.

కాగా, ప్ర‌స్తుతం ఓ టీవీ షోకి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఓంకార్ చివ‌రిగా రాజుగారి గ‌ది 3 అనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు.

Tags :
|
|

Advertisement