Advertisement

  • దారుణ ఘటన: తనతో సంభోగానికి నిరాకరించాడని ఓ వృద్ధుడ్ని కిరాతకంగా...!

దారుణ ఘటన: తనతో సంభోగానికి నిరాకరించాడని ఓ వృద్ధుడ్ని కిరాతకంగా...!

By: Anji Sun, 20 Dec 2020 9:16 PM

దారుణ ఘటన: తనతో సంభోగానికి నిరాకరించాడని ఓ వృద్ధుడ్ని కిరాతకంగా...!

తమిళనాడు థేనీ జిల్లాలో దారుణ ఘటన బయటపడింది. తనతో సంభోగానికి నిరాకరించాడని ఓ వృద్ధుడ్ని కిరాతకంగా హతమార్చాడో స్వలింగ సంపర్కుడు.

పెరియాకుళంకు చెందిన పొన్నారామ్(75) ఇటీవల మంచంపై శవమై కనిపించాడు. తన తండ్రి మరణంపై అనుమానం వ్యక్తం చేసిన కూతురు మరియమ్మల్.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

దీంతో మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ఎవరో గొంతుకోసి, హత్య చేసినట్టు తేలింది. పొన్నారామ్ ఇంటికి తరచూ వెళ్తున్న అరుణ్ కుమార్(26)ను పోలీసులు విచారించారు.

అరుణ్, ఆ వృద్ధుడితో స్వలింగ సంపర్కం చేస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఓ వివాహానికి వెళ్లొచ్చిన అరుణ్.. పొన్నారామ్ ఇంటికి వచ్చి తనతో సంభోగం చేయమని బలవంతం చేశాడట.

దీనికి ఆ వృద్ధుడు నిరాకరించినందున.. తాగిన మత్తులో అతడ్ని గొంతుకోసి చంపాడని వెల్లడైంది. ఈ ఘటనలో నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపరచిన అనంతరం జైలుకు పంపారు.

Tags :

Advertisement