రూ.2400 కోట్ల పెట్టుబడితో తమిళనాడులో OLA ఈ-స్కూటర్ ఫ్యాక్టరీ
By: chandrasekar Tue, 15 Dec 2020 10:31 AM
దేశంలో క్యాబ్ సర్వీసులను
అందిస్తున్న ప్రముఖ క్యాబ్ సంస్థ OLA
తమిళనాడులో ఈ-స్కూటర్ ఫ్యాక్టరీని ప్రారంభించనుంది.
ప్రపంచంలోని వివిధ దేశాలకు ఇక్కడ తయారు చేయబడే
ఈ-స్కూటర్లను ఎగుమతి చేయడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీని ఓలా సంస్థ
తమిళనాడులో ప్రారంభించనుంది.
ఇందుకోసం తమిళనాడు
రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. తమిళనాడులో
నెలకొల్పనున్న ఈ-స్కూటర్ ఫ్యాక్టరీ వల్ల రాష్ట్రంలో 10 వేల
మందికి పైగా ఉద్యోగ అవకాశాలు మరియు ఉపాధి అవకాశాలు కలగ నున్నట్లు తెలిపింది. ఈ
ఫ్యాక్టరీలో సంవత్సరానికి 20 లక్షల స్కూటర్ యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో
స్థాపించనున్నారు.
ఇందుకోసం రూ.2400 కోట్ల
పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నట్టు తెలిపింది. తాము తయారు చేసిన
ఈ-స్కూటర్లను వచ్చే సంవత్సరం 2021 జనవరి నెలలో మార్కెట్లోకి ప్రవేశ పెట్టనున్నట్లు ఈ
సంస్థ వెల్లడించింది. తమిళనాడులో తయారుచేయబడ్డ ఈ-స్కూటర్లను లాటిన్ అమెరికాకు, యూరోప్
కు మరియు ఆసియా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. దేశంలోనే తమిళనాడు రాష్ట్రం
ఆటోమొబైల్ ఇండస్ట్రీకి హబ్ గా గుర్తించబడిన విషయం అందరికి తెలిసిందే.