Advertisement

  • చమురు రవాణా నౌక ఎంటీన్యూడైమండ్‌లో మంటలు అదుపులోకి...

చమురు రవాణా నౌక ఎంటీన్యూడైమండ్‌లో మంటలు అదుపులోకి...

By: chandrasekar Thu, 10 Sept 2020 5:01 PM

చమురు రవాణా నౌక ఎంటీన్యూడైమండ్‌లో మంటలు అదుపులోకి...


భారత నేవీ శ్రీలంకకు చెందిన చమురు రవాణా నౌక ఎంటీన్యూడైమండ్‌లో మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపింది. గత 24 గంటల్లో ఎలాంటి మంటలు లేదా పొగ ఆనవాళ్లు కనిపించలేదని చెప్పింది.

ఆ నౌక సిబ్బంది బుధవారం అందులోకి వెళ్లి పరిశీలించి అంతా బాగానే ఉన్నదని చెప్పారని తెలిపింది. ఆ టీమ్ గురువారం చమురు నౌక మీదకు వెళ్లి దానిని ఆ తీరానికి చేర్చుతుందని ఇండియన్ నేవీ పేర్కొంది.

కాగా, శ్రీలంక చమురు నౌక ఎంటీన్యూడైమండ్ ప్రమాదంలో ఉన్నట్లు ఈ నెల 3న తమకు సమాచారం అందిందని భారత కోస్ట్‌గార్డ్ డీజీ కే నటరాజన్ చెప్పారు. దీంతో తాము సాయంత్రం 5 గంటలకే ఆ నౌక వద్దకు చేరుకుని మంటలు ఆర్పే చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

శ్రీలంక నేవీ మరుసటి రోజు అక్కడకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నదని వివరించారు. ఆ నౌకలోని చమురుకు ఎలాంటి నష్టం కలుగలేదని తెలిపారు.

Tags :
|
|

Advertisement