చమురు రవాణా నౌక ఎంటీన్యూడైమండ్లో మంటలు అదుపులోకి...
By: chandrasekar Thu, 10 Sept 2020 5:01 PM
భారత నేవీ శ్రీలంకకు చెందిన చమురు రవాణా నౌక
ఎంటీన్యూడైమండ్లో మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపింది. గత 24
గంటల్లో ఎలాంటి మంటలు లేదా పొగ ఆనవాళ్లు కనిపించలేదని చెప్పింది.
ఆ నౌక సిబ్బంది బుధవారం
అందులోకి వెళ్లి పరిశీలించి అంతా బాగానే ఉన్నదని చెప్పారని తెలిపింది. ఆ టీమ్
గురువారం చమురు నౌక మీదకు వెళ్లి దానిని ఆ తీరానికి చేర్చుతుందని ఇండియన్ నేవీ
పేర్కొంది.
కాగా, శ్రీలంక
చమురు నౌక ఎంటీన్యూడైమండ్ ప్రమాదంలో ఉన్నట్లు ఈ నెల 3న తమకు
సమాచారం అందిందని భారత కోస్ట్గార్డ్ డీజీ కే నటరాజన్ చెప్పారు. దీంతో తాము
సాయంత్రం 5 గంటలకే ఆ నౌక వద్దకు చేరుకుని మంటలు ఆర్పే చర్యలు
చేపట్టినట్లు తెలిపారు.
శ్రీలంక నేవీ మరుసటి రోజు
అక్కడకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నదని వివరించారు. ఆ నౌకలోని చమురుకు
ఎలాంటి నష్టం కలుగలేదని తెలిపారు.