Advertisement

  • జీహెచ్ఎంసీలోని అధికారులు తీవ్ర తప్పిదం...గుర్తులు తారుమారు...

జీహెచ్ఎంసీలోని అధికారులు తీవ్ర తప్పిదం...గుర్తులు తారుమారు...

By: chandrasekar Tue, 01 Dec 2020 7:27 PM

జీహెచ్ఎంసీలోని అధికారులు తీవ్ర తప్పిదం...గుర్తులు తారుమారు...


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అధికారులు పెద్ద తప్పిదం చేశారు. ఒక పార్టీ గుర్తు ముద్రించాల్సి ఉండగా, మరో పార్టీ గుర్తును ముద్రించారు. ఈ విషయాన్ని నేతలు గుర్తించి ఎస్ఈసీకి ఫిర్యాదు చేయడంతో అక్కడ పోలింగ్ రద్దు చేసారు. హైదరాబాద్‌లోని 26వ డివిజన్ ఓల్డ్ మలక్ పేటలో సీపీఐ అభ్యర్థి పోటీ చేస్తున్నారు.

కానీ, అక్కడ సీపీఐ గుర్తు కంకి కొడవలి గుర్తుకు బదులుగా సీపీఎం గుర్తు అయిన సుత్తి కొడవలి గుర్తు వచ్చింది. దీన్ని గుర్తించిన సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో అక్కడ ఓటింగ్ నిలిపివేశారు. అక్కడ పోలింగ్ రద్దు అయింది. తర్వాత రీ పోలింగ్ జరిగే అవకాశం ఉంది.

Tags :

Advertisement