Advertisement

Breaking News: కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి...!

By: Anji Mon, 05 Oct 2020 4:26 PM

Breaking News: కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి...!

కరోనాతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజకీయ నేతలకు ఈ కరోనా వైరస్ శాపంగా మారింది. తాజాగా రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన ఒడిశా ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి (65) తిరిగి పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

బిజూ జనతాదళ్(బీజేడీ)కు చెందిన ప్రదీప్ పూరి జిల్లాలోని పిపిలి నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత నెల 14న కొవిడ్ బారినపడిన ఎమ్మెల్యే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఇటీవల ఆయన కోలుకోవడంతో బతికే ఛాన్స్ ఉందని సంతోషించారు. అయితే, రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.

odisha mla pradeep maharathi died with corona virus,odisha mla pradeep maharathi is no more,odisha mla pradeep maharathi passed away,corona virus latest updates,latest telugu news updates

దీంతో మళ్లీ ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి మరింత దిగజారడంతో వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో నిన్న ప్రాణాలు విడిచారు.1985లో తొలిసారి జనతాదళ్లో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రదీప్ మహారథి ఇప్పటి వరకు ఏడుసార్లు విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. ప్రదీప్ మృతికి గవర్నర్ గణేషిలాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తదితరులు సంతాపం తెలిపారు.

Tags :

Advertisement