ఆ రాష్ట్రంలో నవంబర్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు
By: Sankar Sat, 31 Oct 2020 3:26 PM
ఒడిశా రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికీ కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో కంటైన్మెంట్ జోన్లలో నవంబర్ 30 వరకు లాక్డౌన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు స్ఫష్టం చేశారు.
అయితే దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు చేసుకున్న మహారాష్ట్రలో నవంబర్ 30 వరకు లాక్డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి మహరాష్ట్రలో ప్రార్థనా మందిరాలు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్లతో పాటు ఇతర సామాజిక, రాజకీయ కార్యాలయాలు ఇంకా తెరుచుకొలేదు.
ఒడిశాలో ఇప్పటివరకు 2,90,116 కరోనా కేసులు నమోదు కాగా... అందులో 273,838 మంది డిశ్చార్స్ అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 14, 905 యాక్టివ్ కేసులు ఉండగా.. మృతుల సంఖ్య 1,320గా నమోదయ్యాయి..ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా క్రియాశీల కేసులలో మరణాల రేటు 0.45 శాతంగా ఉందని అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,470 కోవిడ్-19 కేసులు నమోదు కాగా 12 మంది మృత్యువాత పడ్డారు. ఇక 1,800 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు