దళిత యువకుడికి శిరోముండనం కేసు నూతన్ నాయుడుకు ఎట్టకేలకు బెయిల్...
By: chandrasekar Wed, 18 Nov 2020 5:09 PM
విశాఖపట్నంలో ఓ యువకుడికి
శిరోముండనం కేసుతో పాటు పలు కేసుల్లో అరెస్టయిన నటుడు, బిగ్బాస్
ఫేమ్ నూతన్ నాయుడుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. కోర్టు ఆదేశాల మేరకు బెయిల్పై
నూతన్ నాయుడును జైలు అధికారులు విడుదల చేశారు. నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి
శిరోముండనం చేసిన ఘటన ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. స్వయంగా నూతన్
నాయుడు భార్య దగ్గరుండి మరీ యువకుడికి శిరోముండనం చేయించినట్లు సీసీటీవీ ఫుటేజీలో
స్పష్టంగా బయటపడింది. ఈ కేసులో నూతన్ నాయుడు ఏ8 నిందితుడుగా ఉన్నాడు.
సెప్టెంబర్ 3న
బెంగుళూరు ఉడిపిలో పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత నూతన్ నాయుడు మోసాలు
ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. శిరోముండనం కేసుతో పాటు ఉద్యోగాల పేరుతో మోసం చేయడం, ఉన్నతాధికారి
పేరుతో పలువురికి కాల్స్ చేసినట్లు నూతన్ నాయుడుపై అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో
అతడిపై అట్రాసిటీ కేసుతో పాటు 7 కేసులను పోలీసులు నమోదు చేశారు. పెందుర్తిలో 3 , గోపాలపట్నం, కంచరపాలెం, గాజువాక, మహారాణిపేట
పీఎస్లలో ఒక్కో కేసు నమోదైంది. ఈ అన్ని కేసుల్లోనూ నూతన్ నాయుడుకు బెయిల్
మంజూరైంది. దీంతో దాదాపు 70 రోజుల తర్వాత నూతన్ నాయుడు బయటకు వచ్చారు.