Advertisement

కరోనా కారణంగా నుమాయిష్ ఎగ్జిబిషన్ వాయిదా

By: Sankar Thu, 31 Dec 2020 2:24 PM

కరోనా కారణంగా నుమాయిష్ ఎగ్జిబిషన్ వాయిదా


ప్రతి ఏడాది జనవరి నెలలో హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నూమాయిష్ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తుంటారు. నెల రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేస్తారు.

హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ఎగ్జిబిషన్ చూసేందుకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. అయితే, కరోనా కారణంగా కొత్త సంవత్సరంలో జరగాల్సిన ఎగ్జిబిషన్ జరుగుతుందా లేదా అనే సందేహాలు ఉన్నాయి.

కొత్త సంవత్సరం నుంచి జరగాల్సిన నూమాయిష్ ఎగ్జిబిషన్ ను వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అయితే ఎప్పుడు తిరిగి ఎగ్జిబిషన్ నిర్వహించాలి అనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు.

Tags :
|

Advertisement