Advertisement

  • నీట్ 2020 పరీక్షకు మార్గదర్శకాలను విడుదల చేసిన ఎన్‌టీఏ

నీట్ 2020 పరీక్షకు మార్గదర్శకాలను విడుదల చేసిన ఎన్‌టీఏ

By: Sankar Wed, 26 Aug 2020 2:40 PM

నీట్ 2020 పరీక్షకు మార్గదర్శకాలను విడుదల చేసిన ఎన్‌టీఏ


నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ 2020 ) కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ విడుదల అయ్యాయి ..అయితే కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్న కారణంగా ఈ సారి పకడ్బందీగా పరీక్షా నిర్వహించనున్నారు..దీనిలో భాగంగా ఎన్టీయే కొన్ని మార్గదర్శకాలను ఇడుదల చేసింది ..

1. విద్యార్థుల్లో అధిక శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి సెంటర్‌నే కేటాయించాలి.

2. పరీక్ష సెంటర్‌కి వచ్చే విద్యార్థులు కచ్చితంగా ముఖానికి మాస్క్‌లు, చేతికి గ్లౌజ్‌లు ధరించాల్సి ఉంటుంది.

3.వాటర్ బాటిల్‌, శానిటైజర్ కూడా వెంట తీసుకురావాలి.

4. భౌతిక దూరం పాటించాలి.

5. ఎగ్జామ్‌ సెంటర్‌లోకి కేవలం అడ్మిట్ కార్డుని మాత్రమే తీసుకురావాలి.

6. కేటాయించిన స్లాట్ల ప్రకారం పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలి. గుంపులుగా ఉండకూడదు.

7. శరీర ఉష్ణోగ్రత 99.4 ఫారిన్‌హీట్‌ డిగ్రీల కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులకు ఐసోలేషన్‌ గదుల్లో పరీక్ష.

8. ఐసోలేషన్‌ గదుల్లోనే డాక్యుమెంట్‌ వెరిఫికేషన్ చేయనున్నారు. ఇందుకోసం 15-20 నిమిషాల సమయం పట్టనుంది. ఆ లోపు వారి ఉష్ణోగ్రత తగ్గకపోతే.. ప్రత్యేక రూమ్‌లో వారికి పరీక్ష నిర్వహించనున్నారు.

9. పరీక్ష హాల్‌లోకి వెళ్లేముందు ప్రతి ఒక్కరు చేతులను శుభ్రపరచుకోవాలి.

10. పరీక్ష తరువాత ఒక్కొక్కరుగా బయటికి వెళ్లాలి.

11. పరీక్ష ముగిసిన వెంటనే మాస్క్‌, గ్లోవ్స్‌ని పరీక్ష సెంటర్ బయట ఉన్న చెత్తబుట్టలో పడేయాలి.

Tags :
|
|

Advertisement