బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కరణ్ జోహార్కు నోటీసులు...
By: chandrasekar Fri, 18 Dec 2020 3:45 PM
నార్కొటిక్స్ కంట్రోల్
బ్యూరో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్కు నోటీసులు జారీ చేసింది. శాంత్
సింగ్ రాజ్పుత్ మరణం తరువాత బాలీవుడ్లో ప్రకంపనలు మొదలైనాయి. ఈ కేసు విచారణలో
బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ముమ్మరంగా దర్యాప్తు
చేస్తోంది. కరణ్ జోహార్ 2019లో జూలైలో సెలబ్రిటీస్తో నిర్వహించిన పార్టీపై వివరణ
ఇవ్వాలని ఆదేశించింది. ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగించారని కరణ్ ఆరోపణలు
ఎదుర్కొంటున్నారు. ఆ పార్టీకి చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. విచారణకు
హాజరుకావాలని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది ఎన్సీబీ.
సుశాంత్ ప్రియురాలు రియా
చక్రవర్తి అరెస్టయిన తర్వాత డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటీమణులు, పలువురు
సినీ ప్రముఖలను ఎన్సీబీ విచారించింది. ఈ డ్రగ్స్ కేసులో మరి కొంత మంది బాలీవుడ్
సెలబ్రిటీలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ బుల్లితెర కమెడియన్ భారతీ
సింగ్, ఆమె భర్తను
పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. అలాగే నార్కోటిక్స్ బృందం ఇటీవల దర్యాప్తులో
భాగంగా రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్ , శ్రద్ధా కపూర్ లను విచారించారు. వీరే కాకుండా క్వాన్
టాలెంట్ ఏజెన్సీ కి సంబంధించిన మధు మంతెన, కరిష్మా ప్రకాష్ , నిర్మాత క్షితిజ్ ప్రసాద్ తదితరులను విచారించారు.