ఆ ఆటగాడిని సూపర్ ఓవర్లో ఆడించకపోవడం వల్లనే ముంబై ఇండియన్స్ ఓడిపోయిందా !
By: Sankar Tue, 29 Sept 2020 10:56 AM
నిన్న రాత్రి రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ చివరి దాకా పోరాడిన ముంబై ఇండియన్స్ చివర్లో సూపర్ ఓవర్లో ఓడిపోయింది..అయితే సూపర్ ఓవర్లో ముంబై ఇండియన్స్ చేసిన ఒక తప్పిదం వల్లనే ఓటమి పాలుఅయిందని విశ్లేషకులు భావిస్తున్నారు..అప్పటిదాకా అద్భుతంగా ఆడుతున్న ఇషాన్ కిషన్ ను కాదని హార్దిక్ పాండ్యను సూపర్ ఓవర్లో బాటింగ్ కు పంపాడు..ఇషాన్ కిషన్ ను పంపకపోవడం వల్లనే ముంబై ఓడిపోయింది అని అంటున్నారు..అయితే ముంబై కెప్టెన్ రోహిత్ దీని మీద వివరణ ఇచ్చాడు..
ఇషాన్ కిషన్ అలసిపోయి, చెమట కారణంగా అసౌకర్యంగా ఉండటంతో.. అతడి బదులు హార్దిక్ పాండ్య బరిలో దింపినట్లు మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ తెలిపాడు. కానీ ఇదే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది. ‘‘చెమటతో ఇబ్బంది పడుతుంటే.. ఆ టీ షర్ట్ తీసేసి మరొకటి వేసుకొని.. చేతుల గ్లౌవ్స్ మార్చయినా సరే ఇషాన్ను పంపాల్సింది. ఆడేది ఆరు బంతులే కావడంతో అదేమంత కష్టం కాదు.
ఒక్కసారి గ్రౌండ్లోకి అడుగుపెడితే అవేవీ గుర్తుకు రావు. లెఫ్ట్ హ్యాండర్ అయిన ఇషాన్ కిషన్ కచ్చితంగా ప్లస్ అయ్యేవాడు. సాధించాల్సింది 8 రన్సే కావడంతో కోహ్లి బరిలో దిగాడు. కానీ లక్ష్యం ఎక్కువగా ఉంటే కచ్చితంగా ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ను బరిలో దింపేవాడు’’ అని కామెంటేటర్లు సునీల్ గావస్కర్, పీటర్సన్ అభిప్రాయపడ్డారు.