Advertisement

  • బస్సు హైజాక్ కాలేదు ..వాళ్ళే స్వాధీనం చేసుకున్నారు..అసలు విషయం తేల్చిన పోలీసులు

బస్సు హైజాక్ కాలేదు ..వాళ్ళే స్వాధీనం చేసుకున్నారు..అసలు విషయం తేల్చిన పోలీసులు

By: Sankar Wed, 19 Aug 2020 2:03 PM

బస్సు హైజాక్ కాలేదు ..వాళ్ళే స్వాధీనం చేసుకున్నారు..అసలు విషయం తేల్చిన పోలీసులు


ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో బస్సు హైజాక్ అయింది అన్న న్యూస్ తెగ హల్చల్ చేసింది..గురుగ్రామ్ నుంచి 34 మంది ప్రయాణికులతో మధ్యప్రదేశ్‌లోని పన్నా వెళ్తున్న బస్సు హైజాక్‌కు గురి అయినట్లు వార్తలు వచ్చాయి..ఈ వార్తలపై తాజాగా యూపీ పోలీసులు స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్నట్టు ఆ బస్సు‌ను హైజాక్ చేయలేదని, వాహనంపై తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో సదరు ఫైనాన్స్ సంస్థ దానిని స్వాధీనం చేసుకుందని తెలిపారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వాహనం కొనుగోలుకు రుణం తీసుకున్న యజమాని వాయిదాలను సకాలంలో చెల్లించకపోవడంతో బస్సును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, ఫైనాన్స్ కంపెనీపై కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. బస్సును మధ్యప్రదేశ్‌లోని ఝాన్సీకి తరలించారు. బస్సు గురుగ్రామ్ నుంచి మధ్యప్రదేశ్‌లోని పన్నాకు వెళ్తున్నట్టు పేర్కొన్నారు.

‘పోలీసులకు ఫిర్యాదు చేసిన బస్సు డ్రైవర్, కండక్టర్.. గురుగ్రామ్ నుంచి మధ్యప్రదేశ్‌లోని పన్నాకు వెళ్తుండగా మార్గమధ్యంలో కొందరు అడ్డుకున్నట్టు తెలిపారు.. దీనికి ఫైనాన్స్ సంస్థే బాధ్యులు.. వారిపై కేసు నమోదు చేశాం’ అని ఆగ్రా ఎస్పీ బబ్లూ కుమార్ అన్నారు. బస్సును ఫైనాన్స్ సంస్థ అన్యాయంగా స్వాధీనం చేసుకుందని, అందులోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని యూపీ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

Tags :
|
|
|

Advertisement