ప్రత్యక్షం అయిన ఉత్తర కొరియా అధినేత కిమ్ ...మరణించాడు అన్న వార్తలకు చెక్
By: Sankar Tue, 08 Sept 2020 10:22 AM
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్పై ఏ వార్త వచ్చినా సంచలనంగా మారిపోతుంది... కిమ్ కొన్ని రోజులు కనిపించలేదంటే చాలు.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల పుకార్లు షికారు చేస్తాయి.. అంతేకాదు.. ఆయన ఉన్నాడా? చనిపోయాడా? అనే చర్చ సాగిస్తారు. ఏకంగా చనిపోయాడనే వార్తలు వస్తాయి..
దానికి.. కిమ్ చెల్లి కీలక బాధ్యతలు తీసుకోవడమే కారణంగా చూపుతుంటారు. మొత్తానికి కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు మరోసారి చెక్ పడింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కిమ్ ప్రత్యక్షమయ్యారు. ఐదు రోజుల క్రితం మే సాక్ సైక్లోన్ ఉత్తర కొరియా తీరాన్ని తాకింది. ఈ తుపాను వల్ల భారీ నష్టం జరిగింది.
దీంతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కిమ్ పర్యటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని సిబ్బందిని ఆదేశించారు. మే సాక్ సైక్లోన్ వల్ల ఉత్తర కొరియాలో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయ్. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు..