Advertisement

  • కొత్త వైరస్ అంత ప్రాణాంతకం అని చెప్పలేము ...ఇండో-అమెరికన్‌ డాక్టర్‌ వివేక్‌మూర్తి

కొత్త వైరస్ అంత ప్రాణాంతకం అని చెప్పలేము ...ఇండో-అమెరికన్‌ డాక్టర్‌ వివేక్‌మూర్తి

By: Sankar Mon, 21 Dec 2020 10:03 PM

కొత్త వైరస్ అంత ప్రాణాంతకం అని చెప్పలేము ...ఇండో-అమెరికన్‌ డాక్టర్‌ వివేక్‌మూర్తి


ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే..అనేక దేశాలు కరోనా మహమ్మారి దెబ్బకు అతలాకుతలం అయ్యాయి ..అయితే కరోనా కొంచెం తగ్గుముఖం పడుతుంది అని భావిస్తుండగా మరొక వైరస్ ప్రపంచ దేశాల మీద దండయాత్రకు రెడీ గా ఉంది..ఇప్పటికే బ్రిటన్ లో ఈ కొత్త వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూయిస్తుంది...

అయితే బ్రిటన్‌లో వెలుగుచూసిన న్యూ కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ ప్రాణాంతకం అని నమ్మడానికి ఎటువంటి సంకేతాల్లేవని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్‌ అడ్మినిస్ట్రేషన్‌లో సర్జన్‌ జనరల్‌, ఇండో-అమెరికన్‌ డాక్టర్‌ వివేక్‌మూర్తి పేర్కొన్నారు. న్యూ వైరస్‌ స్ట్రెయిన్‌తో 70 శాతం ఇన్‌ఫెక్షన్లు ఉంటాయని చెప్పడానికి ఎటువంటి సహేతుకమైన కారణం లేదన్నారు. ‘అది మరింత వ్యాప్తి చెందేలా కనిపిస్తున్నది. ఎవరైనా వ్యక్తికి సోకితే అది ప్రాణాంతకం అని చెప్పడానికి పరీక్షల్లో నిర్ధారణ కాలేదని అని అన్నారు ...

ఇక బ్రిటన్‌లో కరోనా న్యూ వైరస్‌ స్ట్రెయిన్‌ వెలుగు చూడటంతో భారత్‌తోపాటు పలు దేశాలు.. ఆ దేశం నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. తద్వారా బ్రిటన్‌ నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. అయితే, ప్రజలు ఫేస్‌మాస్క్‌ ధరించడంతోపాటు శానిటైజర్‌ వాడుతూ సామాజిక దూరం పాటించాల్సిందేనని డాక్టర్‌ వివేక్‌ మూర్తి హెచ్చరించారు.

Tags :

Advertisement