అమిత్ షాకు ఈరోజు అసలు కరోనా టెస్ట్ చేయలేదు ..కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడి
By: Sankar Sun, 09 Aug 2020 8:40 PM
అమిత్ షా కొవిడ్-19 నుంచి కోలుకున్న వార్తలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తోసిపుచ్చాయి. వారం రోజులుగా ఆయనకు మళ్లీ కొవిడ్ పరీక్షలు చేయలేదని తెలిపారు. హో మంత్రి అమిత్ షాకు కరోనా నెగటివ్గా వచ్చిందంటూ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ట్వీట్ చేశారు.
వారం తర్వాత జరిపిన పరీక్షల్లో అమిత్ షాకు నెగటివ్ వచ్చిందని హిందీలో ఆయన ట్వీట్ చేశారు. దీంతో అమిత్ షా కొవిడ్ నుంచి కోలుకున్నారని అందరూ భావించారు. అయితే, ఆ వార్తల్లో వాస్తవం లేదని హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణ ద్వారా తేలింది. అనంతరం మనోజ్ తివారీ తన ట్వీట్ను తొలగించడం గమనార్హం.
అమిత్ షా ప్రస్తుతం గుర్గావ్లోని మేదాంత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఎయిమ్స్ వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా తర్వాత ఆరుగురు కేంద్ర మంత్రులు కూడా కరోనా బారినపడ్డారు. వివిధ హాస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా మేదాంత హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు.