కూరగాయలు, పండ్లని డిటర్జెంట్స్తో క్లీన్ చేయాల్సిన అవసరం లేదు
By: chandrasekar Mon, 29 June 2020 11:45 AM
రోజురోజుకి కరోనా వైరస్
విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ వైరస్ నుంచి
తమని తాము కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంట్లో వాడే ప్రతి
వస్తువుని జాగ్రత్తగా వాడడం. తెచ్చుకుంటున్న వస్తువులని జాగ్రత్తగా ఒకటికి రెండు
సార్లు కడగడం ఇలా చేస్తున్నారు. లాక్ డౌన్ కారణగా కూడా బయటికి వెళ్లడం లేదు.
ఒకేసారి ఇంట్లోకి
కావాల్సిన వస్తువులని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇంటికి కావాల్సిన రేషన్ సరుకులు
నెలకోసారి తెచ్చిపెట్టుకోగా, కూరగాయలు, ఆకుూరలు వారానికి ఓ సారి తెచ్చి పెట్టుకుంటున్నారు.
అయితే, కూరగాయలు, పండ్లు
తెచ్చుకుంటున్నారు. వాటిని శుభ్రం చేసుకునే విషయంలో ఎన్నో అనుమానాలు. వాటిపై
బ్యాక్టీరియా, క్రిములని నాశనం చేయాలని మళ్లీ మళ్లీ కడగటం, డిటర్జెంట్స్, డెటాల్, శానిటైజర్స్తో
క్లీన్ చేసి వాటిని క్లీన్ చేసి అరగంట పాటు ఆరబెట్టి వాడుకుంటున్నారు.
మరి ఇలా డిటర్జెంట్స్తో
క్లీన్ చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలా క్లీన్ చేశాక
వాటిని మళ్లీ సరిగ్గా కడగకపోతే వాటిపై డిటర్జెంట్స్ ఉంటాయని, అవి
లేని పోని సమస్యలకు కారణం అవుతాయని చెబుతున్నారు. అందుకే డిటర్జెంట్స్తో
కూరగాయలను క్లీన్ చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు.
కూరగాయలు, పండ్లు
క్లీన్ చేసేందుకు ఓ చక్కని ఉపాయం ఉంది. అదేంటంటే ఉప్పు, పసుపు
కడిగిన నీటిలో కూరగాయలను ఓ 10 నుంచి 15 నిమిషాలు ఉంచి వాటిని శుభ్రంగా కడిగి ఉడికించి తింటే
మంచిదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి క్రిములైనా పోతాయని ఏ సమస్యలు రావని
చెబుతున్నారు.
ఇక చర్మం పల్చగా ఉన్న
కూరగాయలు, పండ్లు
అంటే టమాటోలు, బెర్రీస్, ద్రాక్ష వంటి వాటిని మంచి నటితో కడగటం మంచిదని
చెబుతున్నారు. వీటిని నీటిలో కాసేపు నానబెట్టి కడిగితే మంచిదని చెబుతున్నారు.
కూరగాయలు, పండ్లని
డిటర్జెంట్స్తో క్లీన్ చేయాల్సిన పని
లేదు.