Advertisement

ఆ ధ్రువపత్రం లేనిదే అమెరికాకు నో ఎంట్రీ....!

By: Anji Fri, 25 Dec 2020 10:02 PM

ఆ ధ్రువపత్రం లేనిదే అమెరికాకు నో ఎంట్రీ....!

కరోనా దెబ్బకు విలవిల్లాడిన అమెరికా కొత్తరకం కరోనా(స్ట్రెయిన్​) వైరస్‌ వ్యాప్తిపై మరింత అప్రమత్తమైంది. తమ దేశంలోకి వచ్చే బ్రిటన్​(యూకే) ప్రయాణికులు కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా చూపించాలని ఆదేశించింది.

ఈ మేరకు అమెరికా వ్యాధి నివారణ కేంద్రం (సీడీసీ) మార్గదర్శకాలు జారీ చేసింది. ధ్రువపత్రం లేనివారిని విమానంలోకి అనుమతించవద్దని విమానయాన సంస్థలకు సూచించింది.

సోమవారం నుంచే ఈ మార్గర్శకాలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. మార్చిలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో యూకేలో పర్యటించిన వారందరి ప్రవేశంపై నిషేధం విధిస్తూ ట్రంప్‌ జారీ చేసిన ఆదేశాల్ని ఈ సందర్భంగా సీడీసీ ప్రస్తావించింది.

సీడీసీ తాజా నిర్ణయంతో ట్రంప్‌ పాలకవర్గానికి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. బ్రిటన్​ నుంచి వచ్చే వారికి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేసే ఆలోచనేమీ లేదని శ్వేతసౌధం మంగళవారం తెలిపింది. దీనికి విరుద్ధంగా సీడీజీ తాజా మార్గదర్శకాలు ఉండడం గమనార్హం.

Tags :
|

Advertisement