2000 రూపాయల నోట్ల ముద్రణపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
By: Sankar Sun, 20 Sept 2020 11:14 AM
దేశంలో మోడీ సర్కార్ హఠాత్తుగా పాత వెయ్యి , 500 రూపాయల నోట్లు బ్యాన్ చేయగానే దేశం మొత్తం షాకయింది.. వాటిస్థానంలో కొత్తగా 2000 నోటు ప్రవేశపెట్టడంతో ప్రజలు కొత్తలో సరిగా దానికీ అలవర్చు పడలేకపోయారు..అయితే మెల్లగా 2000 నోటు అనేది ప్రజల్లోకి వచ్చేసింది..అయితే ఇటీవల ఆ నోట్ల ముద్రణ నిలిపివేసింది ఆర్బీఐ. దీనితో ఈ నోటు కూడా బ్యాన్ చేస్తారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు..
అయితే.. దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం.. రూ. 2 వేల నోటు ముద్రణను నిలిపివేసే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది. ఆర్థిక శాఖసహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. లావాదేవీలను సులభంగా నిర్వహించేందుకు వీలుగా బ్యాంకు నోట్ల ముద్రణపై ఆర్బీఐని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అలాగే నోట్ల ముద్రణకు సంబంధించి దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయినట్లు ఆర్బీఐ తెలిపిందని ఠాకూర్ వెల్లడించారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ముద్రణ ప్రక్రియ దశలవారీగా ప్రారంభమైందని తెలిపారు.