Advertisement

  • సిడ్నీ లో టెస్ట్ జరుగుతుంది ..క్లారిటీ ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా

సిడ్నీ లో టెస్ట్ జరుగుతుంది ..క్లారిటీ ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా

By: Sankar Sun, 20 Dec 2020 5:29 PM

సిడ్నీ లో టెస్ట్ జరుగుతుంది ..క్లారిటీ ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా


భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) స్పష్టం చేసింది. సిడ్నీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో మూడో టెస్టు వేదికలో మార్పులు చేయాలని సీఏ ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో సిడ్నీ టెస్టు యథావిధిగా జరుగుతుందని, షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని సీఏ ఆదివారం వెల్లడించింది. జనవరి 7 నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టుకు సిడ్నీ ఆతిథ్యమిస్తుండగా.. ఆఖరిదైన నాలుగో టెస్టు బ్రిస్బేన్‌లో జనవరి 15 నుంచి మొదలవనుంది.

కాగా ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ అడిలైడ్ లో పింక్ బాల్ తో జరుగగా టీమిండియా దారుణ ఓటమిని చవిచూసింది...ఇక తొలి టెస్ట్ తర్వాత కోహ్లీ స్వదేశానికి రానుండగా , తర్వాత మూడు టెస్టులకు రహానే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు...

Tags :

Advertisement